యాదాద్రిలో CM రేవంత్ ప్రత్యేక పూజలు

యాదాద్రి, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీ నరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు.ముఖ్యమంత్రి తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ , అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....