ప్రజలకే మేం జవాబుదారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) : అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఒక్కమాట నాకు చెప్పలేదు.. నేరుగా భర్తరఫ్ చేసారని కొండా సురేఖ అన్నారు. గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా ఉరివేస్తున్నాం..అని చెప్తారు.. చివరికొరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. కానీ కావాలని కక్ష కట్టి కుట్ర చేసి తిరుపతి రెడ్డి… తదితరులు..నన్ను తీసేయించారని అన్నారు. సుమంత్ విషయంలో కూడా అంతా కుట్ర చేసారు..సుమంత్ పేరు చెప్పి నేరాలు సెటిల్మెంట్లు చేసి కావాలని బద్నాం చేశారు. సుమంత్ కేసును సీసీఎస్ కు బదిలీ చేసి టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మంత్రిగా ఉండగా మా ప్రభుత్వంలో ఇంత జరుగుతోంది. ఎవరైతే నన్ను బర్తరఫ్ చేయించిన వారిలో మల్లు రవి ఉన్నాడు.. ఆయన తిట్టలేదా పార్టీని. మాజీ సీఎం రోశయ్య ఏకంగా విధవ రాజ్యం ఏలుతోందని ఇందిరాగాంధీని తిట్టాడని అన్నారు.
యాబై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడు అని తిట్టిపోసిన వాళ్ళని ఎందుకు వదిలేశారు. ప్రజలనుండి రాజకీయాల్లో పైకి వచ్చాం… ప్రజలకే మేం జవాబుదారీ. కడియం శ్రీహరి కూడా నాగురించి మాట్లాడుతున్నాడు.నా కూతురు అంటే నన్ను తీసేస్తారా..? నాకు చెప్పాపెట్టకుండా నన్ను తీసేస్తారా..? నాకు జరిగిందే విÖకు జరుగుతుంది..! ఇబ్బంది పడుతున్న నేతలారా.. బయటకు రండి.. గళం విప్పండని అన్నారు.
ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై నోరు విప్పండి. లేదంటే నష్టం తప్పదు.. నా పదవి తీసేయడం వేరు.. నాకు ముందే చెప్పాల్సింది. బీసీ రిజర్వేషన్లు మేము చేశాం అంటున్న సీఎం రేవంత్ ఒక బీసీ మహిళ మంత్రి పదవి ఎలా తీసేసారో చెప్పాలి. ప్రభుత్వం సర్దుకోవాలి.. మార్చుకోవాలి.. మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు రాబోతున్నాయి.మోనోపోలీ వ్యవహారం తప్పు..నేను పదేళ్లు సీఎం అని ఆయనకు ఆయన చెప్పుకోవడం తప్పు.ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం తప్పని అన్నారు.