సహకార సంఘం డైరెక్టర్ పోస్ట్ కు నామినేషన్ దాఖలు చేసిన జమాల్ పూర్ అశోక్
హైదరాబాద్, జూలై 22 (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తీ గౌలిపురలోని ఆరెకటిక సంఘం ఎన్నికలు జూలై 27 న జరగనున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఎన్నికలను నిర్వహించనున్నారు. మంగళవారం ఎన్నికల నామినేషన్ కు చివరిరోజు కావడంతో సహకార సంఘం డైరెక్టర్ పోస్ట్ కు జమాల్ పూర్ అశోక్ నామినేషన్ వేయడం జరిగింది. సహకార సంఘం అధికారి నాగిరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు యశ్వంత్ రావు, ఎం రమేష్, జె బాబురావు, పి రఘురాం, అంబాదాస్, జె సురేందర్, ఎన్ మారుతీ రావు బి రాజేష్, ఏ రవీందర్, కే సురేష్ తదితరులు పాల్గొన్నారు.