Ramanthapur లో దోపిడీ ముఠా Arrest

మేడ్చల్, జూన్  9 (ఇయ్యాల తెలంగాణ) : ఉప్పల్ పిఎస్ పరిధిలోని రామంతాపూర్లో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.4,000 నగదు, నేరానికి ఉపయోగించిన యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 7 అర్ధరాత్రి 1 గంట సమయంలో (తెల్లవారితే జూన్ 8) లక్క్ష్మీనారాయణ కాలనీకి చెందిన చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి పెట్రోల్ కోసం వెళ్తుండగా మోడ్రన్ బేకరీ సవిÖపంలో నిందితులు దాడి చేసి శివకాంత్ వద్ద ఉన్న రూ.4,000 నగదును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో చంద్రశేఖర్ తలకు గాయమైంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రామంతాపూర్ డీ`మార్ట్ సవిÖపంలో నిందితులను పట్టుకున్నారు.  విచారణలో రాత్రివేళ ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. అరెస్టైన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసులో ఉన్న బాలుడిని సీసీఎల్ హోంకు తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....