Biryani విషయంలో వాగ్వాదం – దంపతుల ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా, జూన్  6 (ఇయ్యాల తెలంగాణ) :  బిర్యానీ విషయంలో ఫోన్‌లో జరిగిన వాగ్వాదం దంపతుల ప్రాణాలు బలితీసుకుంది.  కళింగపట్నానికి చెందిన బలరాం(33), ప్రియాంక(27) విశాఖ శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన భర్త బలరాం, భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తెచ్చి ఉంచాలని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన బలరాం ఆమె మృతదేహాన్ని చూసి భయంతో తన నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....