18 నుంచి KBR పార్క్ చుట్టూ వన్ వే విధానం

ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్

హైదరాబాద్, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానం ఆగస్టు 18 నుంచి అమలు లోకి కానుందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ అన్నారు. బుధవారం అయన విÖడియాతో మాట్లాడుతూ హెచ్ సిటీ తిబిy ప్రాజెక్ట్ పనుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకే వన్వే. ఇప్పటికే రెండుసార్లు పైలట్ ట్రయల్స్ నిర్వహించామని అన్నారు. ఏప్రిల్ 5, జూన్ 21న పైలట్ ట్రయల్స్ నిర్వహణ జరిగింది. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు,సైన్ బోర్డులు వుంచాం. నాలుగు షిఫ్ట్లలో ట్రాఫిక్ సిబ్బంది మోహరింపు వుంటుంది. సిసిటీవీలతో 24 గంటలూ ట్రాఫిక్పై నిఘా వుంటుంది. డ్రోన్లతో రియల్టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తామని అన్నారు. గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలోనూ మార్పులు చేసాం. దాదాపు రెండేళ్ల పాటు వన్వే విధానం అమలు లొ వుంటుంది. రాంగ్సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు వుంటాయి. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....