మెదక్ అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ );మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఓటరు ప్రచార రథంతో మరియు అక్కన్నపేట గ్రామంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటరు చైతన్య సామస్కృతిక బృందం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓటర్లు డబ్బుకు మధ్యానికి బానిసలు కాకుండా ఓటు హక్కు విలువను తెలుసుకుని ఓటును ప్రతి ఓటరు సద్వినియోగ పరచుకొని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో టీం లీడర్ ఎల్లయ్య,కోఆర్డినేటర్ రామారావు,సిద్ధులు తుమ్మల ఎల్లయ్య,శేఖర్ టేక్మాల్ విజయలక్ష్మి,మాధవి,దేవదాస్,కృష్ణ మున్సిపల్ శ్రీనివాస్,కాలేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- ఓటరు చైతన్య సాంస్కృతిక బృందం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఓటరు చైతన్య సాంస్కృతిక బృందం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం
Leave a Comment
Related Post