ముఖ్య అథితిగా రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్ల
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : రుమలే చెన్నాబసవియా చిత్రకళా ప్రదర్శన సామాన్యుడు నేర్చుకోవలసిన అనేక జ్ఞానవంతమైన విషయాలను తెలియజేస్తుందని రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్ల అన్నారు. చిత్రకళలపై నేటి యువతకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్ల కొనియాడారు. బుధవారం నాడు సాలార్జంగ్ మ్యూజియంలో 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రుమలే చెన్నాబసవియా చిత్రకళ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. గాంధీజీతో పాటు స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చిన్న బసవయ్య అనేక ఉద్యమ కళాలను తో పాటు సామాన్యుడు నేర్చుకోవలసిన అనేక జ్ఞానవంతమైన చిత్రాలను గీయడం గొప్పతనం అని ఆయన గొప్పతనం అన్నారు. వర్ణ మైత్రి సొసైటీ చిత్రాలను భద్రంగా ఉంచడం ఎంతో గొప్స పని అని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ ప్రియాంక మేరీ ప్రాసెస్, ఎమ్మెల్సీ పీవీ.సురభి వాణి దేవి, తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జర్నల్, అకౌంట్స్ ముఖ్య కార్యదర్శి చందా పాండి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.