Modi కి స్వీడన్ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ నాయకులకు స్వీడన్ అందించే అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస’ ఆయనకు లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ప్రధాని మోదీ అద్భుతమైన నాయకత్వ పటిమకు ఈ పురస్కారం ఒక నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. అంతర్జాతీయంగా భారత భాగస్వామ్యాలను, ప్రపంచ దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి మోదీ నిరంతరం చేస్తున్న కృషిని ఈ అవార్డు ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు.విశేషమేమిటంటే, ఇది ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానంలో అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం అని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని పెంచడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....