గౌహాతి, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించిన హ్యాట్రిక్ విజయం ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. వ్యతిరేక పవనాలను తట్టుకుని, వరుసగా మÖడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం వెనుక బలమైన వ్యూహాలు, అభివృద్ధి మంత్రం పనిచేశాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంపై ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసం ఈ భారీ విజయానికి ప్రధాన కారణం.అస్సాం రాజకీయాల్లో హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా అవతరించారు. గత ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పాలనా సంస్కరణలు, సాహసోపేతమైన నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణ, చొరబాట్లపై కఠిన వైఖరి , హిందూత్వ ఎజెండాను అభివృద్ధికి జోడించడంలో ఆయన సఫలమయ్యారు. జలుక్బరి వంటి నియోజకవర్గాల్లో ఆయన సాధించిన మెజారిటీయే ఆయన ప్రజాదరణకు నిదర్శనం.బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అరుణోదోయ్ వంటి మహిళా కేంద్రీకృత పథకాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం , రేషన్ కార్డులు, ఉచిత బియ్యం వంటి పథకాలు గ్రావిÖణ, పేద ఓటర్లను బీజేపీకి శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చాయి. మహిళా ఓటర్లు గంపగుత్తగా బీజేపీకి పట్టం కట్టడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.ఈశాన్య రాష్టాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అస్సాంలో స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెనలు, మెరుగైన రహదారి సౌకర్యాలు, గౌహతి విమానాశ్రయం విస్తరణ వంటి పనులు అస్సాం ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుండటంతో, మళ్ళీ బీజేపీకే అవకాశం ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.
బీజేపీ`ఆరఎసఎస్ క్షేత్రస్థాయి యంత్రాంగం అస్సాంలో చాలా బలంగా ఉంది. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు, స్థానిక తెగలు, చిన్న చిన్న సామాజిక వర్గాలను ఏకం చేయడంలో బీజేపీ విజయవంతమైంది. మరోవైపు, విపక్ష కాంగ్రెస్ తన సంస్థాగత లోపాలను సరిదిద్దుకోలేకపోవడం, గౌరవ్ గొగోయ్ వ్యక్తిగతంగా పోరాడినా పార్టీ పరంగా వెనుకబడటం బీజేపీకి సానుకూలంగా మారింది.అస్సావిÖ సంస్కృతిని కాపాడటం, అక్రమ చొరబాట్లను అరికట్టడం వంటి అంశాలపై బీజేపీ తీసుకున్న స్టాండ్ స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. సీఏఏ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ, దానిని అభివృద్ధి, భద్రత అనే అంశాలతో బీజేపీ సమర్థవంతంగా కౌంటర్ చేయగలిగింది. అస్సాం ప్రజల సొంత అస్తిత్వానికి బీజేపీ రక్షణగా ఉంటుందనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. అస్సాంలో బీజేపీ విజయం అనేది కేవలం ఎన్నికల మేనేజ్మెంట్ కాదు, అది ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా చేసిన పాలనకు దక్కిన పురస్కారం. దశాబ్దాల కాంగ్రెస్ పాలన తర్వాత, అస్సాం ప్రజలు ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న బీజేపీ వెంటే ఉంటామని ఈ హ్యాట్రిక్ విజయంతో తేల్చి చెప్పారు. ఈ ఫలితం ఈశాన్య రాష్టాల్లో బీజేపీ పట్టును మరింత సుస్థిరం చేసింది