ఏనుగుల గుంపు సంచారం ?

స్థంభించిన రాకపోకలు

తిరుపతి, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు సంచారంతో సుమారు గంటపాటుగా రాకపోకలు స్తంభించిపోయాయి. ఏనుగుల గుంపు సంచారం పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి రాత్రిపూట ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  కొద్దిరోజుల పాటు గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులు ఆదేశించారు.

సుమారు గంటపాటు కనుమ రహదారిలో స్తంభించిన రాకపోకలు… అందులో రెండు అంబులెన్సులు ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆటవీ అధికారులు, పోలీసులు ఏనుగులను రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి  తరిమేసి రాకపోకలను క్రమబద్ధీకరించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....