TATA చేతిలోకి ITI లు – భారీ ప్రణాళికకు CM గ్రీన్‌ సిగ్నల్‌ !

హైదరాబాద్‌, జూన్‌ 18, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలు దుబాయ్‌ లాంటి విదేశాలకు వలస పోకుండా ఉపాధి గ్యారెంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీలుగా  మారుస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాద్‌ శివారులోని మల్లేపల్లిలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్‌ డెవలప్మెంట్‌ అప్‌ గ్రేడేషన్‌ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయని అన్నారు. ఐటీఐల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని చెప్పారు.‘‘విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. 

40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారు. నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్‌. మేం పాలకులు, విూరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు.. మేం సేవకులం.. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్‌ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్‌ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని నేను నమ్ముతున్నా. కేవలం సర్టిఫికెట్స్‌ జీవన ప్రమాణాలను పెంచవు.దుబాయ్‌ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుంది. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీలుగా మారుస్తున్నాం. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐటీ రంగంలో ప్రపంచం తో మన తెలుగు వారు పోటీ పడుతున్నారు. మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతాం. నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం. విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి’’ అని రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....