Notification రావడంతో రోడ్డెక్కిన వైద్య సిబ్బంది – కలెక్టర్‌ కార్యాలయం ముట్టడించిన ANM లు

హావిూలతో   గొంతు కోసిన సీఎం – 16ఏండ్లుగా చాలీచాలని జీతాలతో చాకిరి        

 

కరోనా కష్టకాలంలోనూ  ఎనలేని  సేవలందించాం

జిల్లా వారిగా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడించిన ఏఎన్‌ఎంలు

ఆసిఫాబాద్‌, ఆగష్టు 07 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమం ఉపందుకుంటున్న సమయంలో అరచేతిలో స్వర్గం చూసేడుతు ఇక ముందు కాంట్రక్టు గాని ఆపుట్‌ సోర్సింగ్‌ అనే మాటనే ఉండదు. ప్రతి ఒక్కరిని రెగ్యులర్‌ చేస్తామంటు హామిలిచ్చిన కేసిఆర్‌ తమను ఆశల పల్లకిలో ఊరేగించి ఉద్యమంలో ప్రాణాలకు తెగించి అందోళలను చేసే విదంగ ప్రేరేపించి రాష్ట్ర సాదన కాగానే తమను తమకిచ్చిన హావిూలను మర్చిపోయి హావిూలతోనే గొంతుకోసి తమను వీధిన పడేవిధంగా చేసి అప్పుడు ఇచ్చిన మాట ఒక్కటి ఇప్పుడు చేసేది మరోకటిగా మారింది కేసిఆర్‌ ప్రభుత్వం దీంతో తెలంగాణ వ్యాప్తంగ రెండో ఏఎన్‌ఎంలు వీధిన పడి ధర్నాలు చేసిన్న పట్టించుకోవడం లేదు. ఉద్యమ సమయంలో ఇచ్చి న హావిూలను నెరవేర్చుతు తమను వెంటనే రెగ్యు లర్‌ చెయ్యాలన్నది వారి డిమాండ్‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 2014లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారికి రెగ్యులర్‌ చేస్తానని ఇచ్చిన హావిూలను మర్చిపోయి ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖమంత్రి మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేయాలని ఏ ఎన్‌ ఎం లను యధావిధిగా ప్రతి ఒక్కరికి రెగ్యులర్‌ చేయాలని ప్రతి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిన కూడా ఈ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.వివరాల్లోకి వెళ్లితే గత 2007సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4200 మంది రెండో ఏఎన్‌ఎంలు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోకాంట్రాక్టు పద్ధతిన పని చేయుటకు జిల్లా సెలెక్షన్‌ కమిటీల ద్వార నియమించ బడ్డారు. అప్పటి నుంచి నేటి వరకు అనగా సుమారు 16 సంవత్సరాలుగా చాలి చాలని జీతాలతో కుటుంబ పోషన జరగపోయిన అత్యంత కఠినంగ తమ కుటుంబాలను పోషస్తు రెగ్యులర్‌ ఏఎన్‌ఎం లతో సమానంగ విదులు నిర్వహిస్తు వస్తున్నారు. ఐతే తెలంగాణ రాష్ట్ర సాదన కోసం సకల జనుల ఉద్యమం చేస్తున్న సమయంలో కేసిఆర్‌ వీరిని రాష్ట్ర ఏర్పాడగానే రెగ్యులర్‌ చేస్తానని హావిూ ఇవ్వ డంతో వీరు ఎంతో ఆశతో ప్రాణాలకు తెగించి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు. కేసిఆర్‌ ఇచ్చిన హావిూలను నమ్మారు, తెలంగాణ వస్తే తమబ్రకులు బాగు పడతాయని ఎంతో ఆశించారు. చివరికి రాష్ట్రసాదన సాధ్యాంఅయింది. అనుకున్నవిదంగ కేసి ఆర్‌ సీఎం కూడ అయ్యాడు. ఆయన గిర్రుమని తిరిగి 9 సంవత్సరాలు కూడ పూర్తిఅయింది. కాని తమ డిమాండ్‌ నెరవేరలేదు. ఉద్యోగాలు రెగ్యులర్‌ కాలేదు. కనీసం జీతలు కూడ పెరగలేగు దీంతో రెండో ఏఎన్‌ఎంలు సహనం కోల్పోయారు. ఉద్యమ సమౌయంలో కేసిఆర్‌ ఇచ్చిన హావిూలు ఏమయ్యా యి అని తమ ఉద్యోగాలకు ఏమైన బద్రత ఉందా అంట అందోళనకు గురిఅవుతున్నారు. విధి నిర్వ హణలో మృతి చెందిన రెండో ఏఎన్‌ఎంల కుటుం బాలను ఆదుకోవలసింది పోయి. కనీసం పరమా ర్పించిన పాపన పోవడం లేదు. ఈ పాలకు, దీంతో ఇక లాబం లేదని భావించిన వీరు తెలంగాణ వ్యాప్తంగ ధర్నాలు ఉద్యమాలు చెయ్యడం మొదలు పెట్టారు. 

కేసిఆర్‌ అప్పుడు ఇచ్చిన హావిూలేంటి ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చెయ్యడంకోసం.వారి వివరాలను కూడ సేకరించింది. వీరు డీఎస్సీద్వార రూల్‌ అప్‌ రిజర్వేషన్‌ ద్వార నియమించబడ్డారు. వీరి విధుల స్వభావం శాశ్వత స్వభావం కల్గిఉంది. సంవత్సరాల తరబడి పర్మినేంట్‌ ఏఎన్‌ఎంలు లేక పోయిన చాలి చాలని జీతాలతో వారి స్థానంలో పని చేస్తున్నారు. రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలాగ యునిఫాం అలవెన్స్‌ కూడ ఇవ్వడంలేదు. జిల్లా స్థాయి. విూటింగులకు వెళ్లినప్పుడు కూడ కనీసం టీఏ డీఏలు కూడ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ట్రాకింగ్‌ వర్క్‌ కోసం కంపూటర్‌ జిరాక్స్ల కోసం 1000 పైగ ఖర్చుఅపుతుంటే వాటిని కూడ తమ జీతాలనుండే పెట్టుకునే పరిస్థితి నెలకొందని విదులు నిర్వహిం చేది అందరు మహిళలే అయినప్పటికీ తమకు వేతనాలతో కూడిన మెటినేటితో కూడిన సెలవులు ఇవ్వక పోవడం వలన మూడు నుండి నెలల కాలాన్ని నష్టపోతున్నామని దీనిని ప్రభుత్వం గమ నించి తమకు తగిన న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలలో సుమా రు 364మంది రెండో ఏఎన్‌ఎంలు నిర్వహిస్తున్నారు. కరోణ కాలంలోని అందరితో పాటు రెండవ ఏఎన్‌ఎంలు విధులు నిర్వహించారు. ఇప్పటికైన దేవుడు కనకరిసతారో ఎమోఅని ఎందురు చూస్తున్నంబతుకులు మారలని బతుకు అడిన్నాము కాని మా.బతుకులు మారాలేదు.. కాన్ని ప్రభుత్వం తమను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....