Modi నాయకత్వాన్ని బలపరచందుకే BJPలోకి : `PL శ్రీనివాస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకే భారతీయ జనతా పార్టీలోకి వెళుతున్నట్లు పి ఎల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను టిఆర్‌ఎస్‌ ను వీడి బిజెపిలోకి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. కెసిఆర్‌ నేతృత్వంలోని టిఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరిన అనంతరం పులి లాంటి నన్ను పిల్లిలా మార్చారని వాపోయారు. ఈనెల 15న మహబూబ్‌ కాలేజీ క్యాంపస్‌ లో నిర్వహించనున్న సభలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బిజెపి సీనియర్‌ నాయకులు లక్ష్మణ్‌ సమక్షంలో బిజెపి లోకి వెళుతున్నట్లు చెప్పారు. తన కుమార్తె అలేఖ్య కూడా పార్టీలో చేరుతుందని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....