MLA ల హక్కులను కాపాడండి !

 స్పీకర్‌ను కోరిన ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) :  అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఓడిపోయిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని, ఇదేనా ప్రజాపాలన అంటే కాంగ్రెస్‌ చెప్పాలని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ను కలిశారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడారు. ప్రొటోకాల్‌ విషయంలో ఉల్లంఘనలను స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గత ఆరు నెలల నుంచి ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎంఎల్‌ఎలకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన అభ్యర్థులు పాల్గొనడం ఏంటని ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎంఎల్‌ఎల హక్కులను కాపాడాలని స్పీకర్‌ను కోరామని, ఎంఎల్‌ఎలకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులను ప్రత్యేక అతిథులగా పిలుచుకొని ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని లక్ష్మారెడ్డి తెలియజేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....