MLA పైళ్లను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు

యాదాద్రి అక్టోబర్ 5 (ఇయ్యాల తెలంగాణ ): యాదాద్రి భువనగిరి జిల్లాలో  బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిలదీస్తున్నారు. తాజాగా.. పోచంపల్లి మండలం, పెద్ద రావులపల్లి గ్రామంలో.. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డిని.. గ్రామ ప్రజలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు, బీసీ బందు లో అక్రమాలు జరిగాయని.. అర్హులను కాదని.. అనర్హులైన ఃఖీూ పార్టీ నాయకులకు ఇచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే పైల్ల శేఖర్‌ రెడ్డిని ఒక్కసారిగా గ్రామ ప్రజలంతా చుట్టుముట్టి నిలదీయడంతో.. వారికి సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి పోలీసుల సహాయంతో బైటపడ్డారు. దీంతో.. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....