Hyderabad లో వర్షం బీభత్సం.. రోడ్లన్నీ వరద నీటితో జలమయం

హైదరాబాద్‌ మే 16 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ నగరంలో గురువారం వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు ఒక గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి.  పంజాగుట్ట, జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌, బేగంపేట, అవిూర్‌ పేట, సికింద్రాబాద్‌, కూకట్‌ పల్లి, రాయదుర్గ, ఉప్పల్‌, ఎల్‌ బినగర్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, కోఠి, నారాయణ గూడ పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో రాయదుర్గం, జూబ్లీహిల్స్‌ బంజారాహిల్ష్‌, పంజాగుట్ట  ప్రాంతాలలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది.తెలంగాణలో మరో ఐదు రోజుల తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ వాఖ తెలిపింది. గంటకు 40 కిలో విూటర్ల నుంచి 50 కిలో విూటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో ఆగ్నేయ దిశగా గాలులు వీయడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతంలో ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలో ఎత్తులో ఉందని వివరించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....