HOTELలో కాల్పులు ఘటన నిందితుడి అరెస్టు


హైదరాబాద్‌:ఆగస్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):మియాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ హోటల్‌ జనరల్‌ మేనేజర్పై జరిగిన కాల్పుల ఘటన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేరళకు చెందిన రితీష్‌ నాయర్‌ కాల్పులు జరిపినట్లు  గుర్తించారు.  మదీనాగూడలోని సందర్శిని హోటల్‌ జనరల్‌ మేనేజర్గా పనిచేస్తున్న దేవేందర్‌ గాయన్‌ (35)పై బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్‌ పోలీసులు నిందితుడిని గుర్తించారు. రితీష్‌ నాయర్‌, దేవేందర్‌ గతంలో ఒకేచోట మేనేజర్లుగా పనిచేశారు. నెలరోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దేవేందర్పై రితీష్‌ చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి దేవేందర్‌ ఫిర్యాదు చేశారు. దాంతో నాయర్‌ ఉద్యోగం పోయింది.ప్రతీకారంగా నాయర్‌ దేవేందర్‌ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్దారించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....