Greater లో 11 లక్షల మందికి చీరలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6, (ఇయ్యాల తెలంగాణ) : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దసరా, బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. మూడు రోజులు పాటు కార్నివాల్‌ తరహాలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నగరంలోని 11 లక్షల మందికి బతుకమ్మ కానుక ఇవ్వనుంది. .గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా 11 లక్షల మందికి దసరా పండుగ కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆడపడుచులకు దసరా పండుగ కానుకతో పాటుగా.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ స?ష్టించేలా కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఇంతకు జీహెచ్‌ఎంసీ ఏం చేయబోతుంది అంటే.. ఈ సంవత్సరం నిర్వహించబోయే బతుకమ్మ ఉత్సవాలను గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోందిఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఏకంగా 11 లక్షల మందితో బతుకమ్మ సంబురాలు నిర్వహించబోతుంది. అలానే వీరందరికి బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈక్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 11 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు పంపిణీ చేయడం కోసం సర్కార్‌ 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించనుంది.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోసం సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించ బోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేరళలో నిర్వహించే ఓనం పండుగ మాత్రమే ఇలాంటి రికార్డు క్రియేట్‌ చేయగా.. ఈసారి బతుకమ్మ ఉత్సవాలతో ఆ రికార్డును బ్రేక్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు, నవరాత్రులు మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సెప్టెంబర్‌ 27న సాయంత్రం ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్నివాల్‌ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్‌ 28న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కార్యక్రమం నిర్వహిస్తారు. 11 లక్షల మంది ఈ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 29న పీపుల్స్‌ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీలు నిర్వహించబోతున్నారు. అలానే సెప్టెంబర్‌ 30వ తేదీన ట్యాంక్‌బండ్‌ వద్ద అంగరంగ వైభవంగా పూల పండుగ నిర్వహించనున్నారు.బతుకమ్మ వేడుకల నేపథ్యంలో నగరంలోని సుమారు 30 సర్కిళ్ల నుంచి మహిళలను శిల్పకళా వేదిక వద్దకు తరలించేందుకు గాను.. 150 బస్సులను వినియోగించబోతున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ పై స్పెషల్‌ పరేడ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలానే రాష్ట్రంలోని పలు చేతివృత్తుల వారు తయారు చేసిన కళాఖండాలు, ఇతర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడమే కాక విక్రయించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు నెక్లెస్‌ రోడ్డులో మూడు రోజుల పాటు.. తెలంగాణ వంటకాలతో స్పెషల్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....