CM KCR ఆరోగ్య పరిస్థితి పై బులిటెన్‌ విడుదల చేయాలి BJP సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ ): : సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల చేయాలని బీజేపీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్‌పై కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌ను ఒత్తిడి చేస్తున్నారు. తమ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుంది. సీక్రెట్‌గా ఉంచడం వల్ల కాన్షీరాం, జయలలిత ఆరోగ్యం ఏమైందో అందరికీ తెలుసు. కాన్షీరాం, జయలలిత మరణాలపై పలు అనుమానాలున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం బులిటెన్‌ విడుదల చేసేలా సీఎస్‌కు ఆదేశాలివ్వాలని గవర్నర్‌కు లేఖ రాశాను’’ అని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....