City లో రోడ్ల విస్తరణ

హైదరాబాద్, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ వాసులకు హెచఎండీఏ తీపి కబురు చెప్పింది. నగరం నుంచి ఓఆరఆర్ వరకు ట్రాఫిక్ లేని ప్రయాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్తగా ఎలివేటెడ్ కారిడార్లతో పాటు.. కొన్ని జాతీయ రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. వ ఇప్పటికే చాలా వరకు ప్రాజెక్టులో మొదలు కాగా.. మరికొన్నింటికి టెండర్లను ఆహ్వానించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో భూ స్థాయిలో 4 లైన్ల రోడ్డును.. దాంతో పాటే 6 లైన్ల రోడ్డుతో రెండు భాగాలుగా అనుసంధానం చేసే ప్రణాళికలను హెచఎండీఏ చేపట్టింది. 

హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీని దష్టిలో ఉంచుకుని.. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రభుత్వం భారీ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నగరం మధ్యలో నుంచి ప్రయాణ సమయాన్ని తగ్గించేలా 6 లైన్ల రహదారుల నిర్మాణం.. ప్రస్తుతం ఉన్న 3 లైన్ల రోడ్లను 4 లైన్లుగా మార్చే పనులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.ఐటీ కారిడార్‌లో అత్యంత రద్దీగా ఉండే నానక్‌రాంగూడ నుండి గచ్చిబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇక్కడ సర్వీసు రోడ్డు కాకుండా ప్రధాన మార్గం మూడు వరుసలుగా ఉంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ల కారణంగా వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ రహదారిని 4 లైన్ల మార్గంగా మార్చనున్నారు. దీని కోసం ప్రభుత్వం సుమారు రూ. 26.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

ఈ విస్తరణతో అవుటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవడం ప్రయాణికులకు సులభతరం కానుంది.కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ వంటి వేగంగా అభివద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఎంజీఐటీ నుండి మణికొండ వరకు కొత్త రహదారిని నిర్మించనున్నారు. సుమారు 3.57 కిలోవిÖటర్ల పొడవునా నిర్మించే ఈ మార్గాన్ని పూర్తిస్థాయిలో 6 లైన్ల రహదారిగా తీర్చిదిద్దనున్నారు. రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, వరద నీటి కాలువలు, ఆధునిక ల్యాండ్‌స్కేపింగ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది పూర్తయితే గండిపేట పరిసర ప్రాంతాల నుండి నగరంలోకి వచ్చే వాహనదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.బంజారాహిల్స్ ఐసీసీసీ టవర్ నుండి శిల్పా లేఅవుట్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నగర రవాణా వ్యవస్థలో కీలక మలుపు కానుంది. రూ. 1,656 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ కారిడార్ ద్వారా బంజారాహిల్స్ నుండి గచ్చిబౌలి వరకు ఎక్కడా సిగ్నల్స్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈ మార్గంలో ఫిల్మ్ నగర్, టీహబ్, ఐటీసీ కోహినూర్ వంటి కీలక జంక్షన్ల వద్ద ప్రవేశ, నిష్కమణ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. భూస్థాయిలో.. ఎలివేటెడ్ విధానంలో 4, 6 వరుసలుగా ఈ రహదారిని అభివద్ధి చేయడం ద్వారా హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు దాదాపుగా తొలగిపోనున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....