సి. బెలగల్ మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. గత రెండు నెలలుగా సరైన వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, పత్తి, పంటలకు భారీ వర్షంతో ఉపశమనం లభించిందని రైతులు తెలిపారు. భారీ వర్షానికి పలుచోట్ల పంట పొలాలు మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. సి.బెళగల్ మండల వ్యాప్తంగా శనివారం 57.6 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదయిందని ఏఎస్ఓ ఆదినారాయణ తెలిపారు.
అన్నదాతకు ఊరట:
భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో భారీ వర్షాలు అన్నదాతకు ఊరటనిస్తున్నాయి. ప్రధానంగా వాగుల వెంట, బోర్లు, బావులలో నీటిమట్టం పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు నాటిన సమయం నుండి ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక సతమతమవుతున్న సమయంలో భారీ వర్షంతో రైతుల కష్టాలు తీర్చాయని ఆనందం వ్యక్తం చేశారు.