Assembly కి కేసీఆర్‌ !

హైదరాబాద్‌, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో గురువారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్‌ ప్రసంగం అయిన తర్వాత ఆయన చర్చలో పాల్గొంటారా.? లేదా.? అనే దానిపై స్పష్టత లేదు. నందినగర్‌లోని నివాసం నుంచి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పూలవర్షం కురిపించారు. దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీలో గులాబీ బాస్‌ అడుగుపెట్టగా.. గురువారం సమావేశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఢల్లీిలో ధర్నా చేద్దామని బుధవారం అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పగా.. మాజీ మంత్రి కేటీఆర్‌ సైతం అందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్‌ కేసీఆర్‌ హాజరు కాలేదు. ఎన్నికల అనంతరం తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగ్గా.. అనారోగ్యంతో ఆయన హాజరు కాలేకపోయారు. 

ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యారు. అంతకు ముందు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అనంతరం రాత్రి రామగుండం చేరుకుని అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్‌ హౌస్‌ పరిశీలన అనంతరం ప్రెస్‌ విూట్‌ నిర్వహిస్తారు. అనంతరం మేడిగడ్డ సందర్శనకు బయలుదేరుతారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వరదల నుంచి బయటపడిరదంటూ ఇటీవల బీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యానించగా.. దీనికి కాంగ్రెస్‌ నేతలు సైతం కౌంటర్‌ ఇచ్చారు.కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చేపట్టినట్లు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....