హైదరాబాద్, మార్చి 26 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం పెట్రోలు బంకుల వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం సోషల్ విÖడియాలో జోరుగా సాగుతోంది. మంగళవారం పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆందోళనకు గురైన వాహనదారులు తమ ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు బంకుల వద్దకు పోటెత్తారు. కూకట్పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్ పేట్, సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్ వంటి ప్రధాన జంక్షన్లలో కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయింది. దీంతో యాజమాన్యాలు ‘నో స్టాక’ బోర్డులు ప్రదర్శించడంతో వాహనదారుల్లో మరింత ఆందోళన నెలకొంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడటం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. చాలా మంది వినియోగదారులు ముందస్తు జాగ్రత్తగా క్యాన్లలో కూడా ఇంధనాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పరిస్థితిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులు మాత్రమేనని, నగరంలో ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ విÖడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద అనవసరంగా గుమిగూడటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఇతర అధికారులు కూడా తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
నగరవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఉప్పల్, మల్లాపూర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు అకస్మాత్తుగా మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ఇది నిజమైన కొరతనా లేక ధరలు పెరుగుతాయన్న ఆశతో యజమానులు సష్టిస్తున్న కత్రిమ కొరతనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి బంకుల్లో తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు, ఎల్పీజీ గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతం. లక్డీకాపూల్ వంటి రద్దీ ప్రాంతాల్లో వందలాది ఆటోలు కిలోవిÖటర్ల మేర క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గంటల తరబడి నిరీక్షణతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతినడమే కాకుండా, ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతిందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో తలెత్తిన ఈ ఇంధన సంక్షోభం సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
