3వ సారి KCR CM అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఇయ్యాల తెలంగాణ ):లకేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ సోమవారం ప్రకటించింది.  మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబరు 3న చేపట్టనున్నట్టు తెలిపింది. ఈసీ షెడ్యూల్‌ ప్రకటించడంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంపై మజ్లీస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని అన్నారు.  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తాము పోటీచేసే ప్రతి చోటా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ సారి రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం తొలిసారిగా పోటీ చేయనున్నట్లు ఒవైసీ ప్రకటించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....