హైదరాబాద్‌ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు రూ. 7,91,720 నగదు సీజ్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19: (ఇయ్యాల తెలంగాణ ):రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటుతో తనిఖీలు ముమ్మరం చేయడంతో ఎక్కడికక్కడ తనిఖీలు చేసి భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా  నగదు, మద్యం, వస్తువులు పట్టుకున్నారు.. అసెంబ్లీ నియోజక వర్గంలో  ఎన్నికల ఉల్లంఘన జరగకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లు, స్టాటిస్టిక్స్‌ సర్వేలేన్స్‌ టీమ్‌ లు వీడియో వీవింగ్‌ టీమ్‌ తో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ సోషల్‌ విూడియా అనుమతి లేని ప్రకటనల పరిశీలనకు విూడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా నగర వ్యాప్తంగా 18 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నగదు, మద్యం, నార్కోటిక్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కమర్షియల్‌ టాక్స్‌, రెవెన్యూ, పోలీస్‌,  ఆర్‌ టి ఓ, నార్కొట్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, డిఆర్‌ఐ ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన శాఖ అధికారులు మూడు షిఫ్ట్‌ లలో 24 గంటలపాటు తనిఖీ చేస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా తనిఖీ సందర్భంగా వీడియో తీయడం జరుగుతుంది.ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా గురువారం రూ. 7,91,720 నగదును సీజ్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి రోనాల్డ్‌ రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా ఇప్పటివరకు 1,07,99,970 నగదును సీజ్‌ చేశారు. పోలీస్‌ అథారటీ ద్వారా 11,58,40,600 సీజ్‌ చేయగా ఇప్పటివరకు 35,28,48,715 నగదును సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఎఫ్‌.ఐ.ఆర్‌ లు 29 నమోదు కాగా ఇప్పటి వరకు 205 నమోదు చేయడం జరిగిందని తెలిపారు. లా అండ్‌ ఆర్డర్‌ కింద లైసెన్స్‌ ఆయుధాలను  ఈ రోజు 241 సేకరించగా ఇప్పటి వరకు 4,164 ఆయుధాలను సేకరించడం జరిగింది. సి.ఆర్‌.పి.సి కింద నేడు 52 కేసులు ఉండగా ఇప్పటి వరకు 333 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 127 బైండోవర్‌ చేయగా ఇప్పటి వరకు 916 బైండోవర్‌ చేయడం జరిగింది. నేడు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ 63 కాగా మొత్తం 414 కేసులు నమోదయ్యాయి. ఎం.సి.సి ఉల్లంఘన కింద నేడు పబ్లిక్‌ ప్రాపర్టీస్‌ లో గురువారం 252 వాల్‌ రైటింగ్‌ తొలగించగా ఇప్పటివరకు 4,969 వాల్‌ రైటింగ్స్‌ ను తొలగించడం జరిగింది. నేడు 1908 పోస్టర్లను తొలగించగా మొత్తం 64,930 పోస్టర్లను తొలగించడం జరిగింది. నేడు 800 బ్యానర్లను తొలగించగా ఇప్పటి వరకు 20,564 బ్యానర్లను తొలగించడం జరిగింది. నేడు పబ్లిక్‌ ప్రాపర్టీలలో 2,463 రాజకీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగింది. ఇప్పటి వరకు 70,202 విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగింది. ప్రైవేట్‌ ప్రాపర్టీలలో నేడు 25 వాల్‌ రైటింగ్‌ లను తొలగించగా ఇప్పటి వరకు 1,087 వాల్‌ రైటింగ్‌ లను తొలగించడం జరిగింది. నేడు 427 పోస్టర్లను తొలగించగా ఇప్పటి వరకు 18,102 పోస్టర్లను తొలగించారు. నేడు 147 బ్యానర్లు తొలగించగా ఇప్పటి వరకు 3,985 బ్యానర్లను తొలగించడం జరిగింది. నేడు 542 రాజకీయ నాయకుల విగ్రహాల పై మాస్కులు వేయడం జరిగింది. ఇప్పటి వరకు 19,279 విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగింది.అనుమతి లేకుండా సభలు, సమావేశాలు గురువారం 1 నిర్వహించగా ఇప్పటి వరకు 8 నిర్వహించడం జరిగింది. ఎఫ్‌.ఐ.ఆర్‌ 1 నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 8 నమోదయ్యాయి. ఎక్సైజ్‌ శాఖ ద్వారా నేడు 221 లీటర్ల లిక్కర్‌ ను సీజ్‌ చేయడం జరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....