రంగారెడ్డి ఆగష్టు 22 (ఇయ్యల తెలంగాణ );విూర్ పేట్ నందనవనం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. నందనవనం లోని ఇందిరమ్మ ఇళ్లల్లో ఆసాంఫీుక కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటూ ఆందోళన చేసారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసారు. నందన వనం లో డ్రగ్స్, గంజాయి కి అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపించారు. రాజకీయ పార్టీలు, స్థానికులు కలిసి రోడ్డు పై బైఠాయించారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.