విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడు ఏమిటి ?

హైదరాబాద్‌ ఆగష్టు 1 : 

 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడును అధికారులు షురూ చేశారు. సిటీలో డే బస్‌ పాస్‌ చార్జీలను టీఎస్‌ఆర్టీసీ పెంచింది. 100 రూపాయలున్న డే పాస్‌ ను 120 కు పెంచింది. గతంలో మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కు 80 రూపాయలున్న డే పాస్‌ ఇప్పడు 100 రూపాయలుగా ఉంది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్‌ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. రూ.120 డే పాస్‌ సమయంలో రోజుకి 25 వేలు మాత్రమే అమ్మకం జరిగింది. రూ.80 రూపాయల డే పాస్‌ సమయంలో రోజుకీ 40 వేల వరకూ అమ్మేవారు. మళ్లీ పెరిగిన టికెట్‌ ధరలతో బాదుడు మొదలైందని ప్రయాణికులు చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....