వరస హత్యలతో బెంబేలెత్తున్న HYDERABAD నగరం !

హైదరాబాద్‌  జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ):పాతబస్తీ చాదర్‌ ఘాట్‌ పరిధి చాదర్‌ ఘాట్‌ పీ ఎస్‌ కు కూత వేటు దూరంలో అర్ధరాత్రి మలక్‌ పేట మెట్రో స్టేషన్‌ మెట్ల వద్ద  రెయిన్‌ బజార్‌ కు చెందిన సయ్యద్‌ నజఫ్‌ అలీ అనే రౌడీ షీటర్‌  దారుణ హత్య.మృతుడు నజఫ్‌ అలీ  పాతబస్తీలోని విూర్‌ చౌక్‌,రెయిన్‌ బజార్‌  పోలీస్‌ స్టేషన్స్‌ రౌడీ షీటర్‌  అని  పోలీసులు తెలిపారు. నజఫ్‌ అలీ పై 3 మర్డర్‌ కేసులు ఉన్నా…2021 నుంచి ఎలాంటి క్రిమినల్‌ ఆక్టివిటీ లేదని తెలుస్తుంది. నజఫ్‌ అలీ పై గుర్తు తెలియని వ్యక్తులు చదార్‌ ఘాట్‌ లోని మలక్‌ పేట మెట్రో వద్ద దగ్గర కత్తులతో దాడి చేసి హత్య చేశారు.నగరంలో జరుగుతున్న హత్యల నేపథ్యంలో ఓ రెండు రోజులు మాత్రమే తూతూ మంత్రంగా నగరంలో హడావుడి చేసిన పోలీసులు.అదే రీతిలో హత్య జరడం తో మరోమారు పోలీసు వ్యవస్థ ఉలిక్కిపడిరది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నత అధికారులు  డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ మలక్‌ పేట శ్యామ్‌ బాబు.డాగ్‌ స్క్వాడ్‌,క్లూస్‌ టీమ్‌ తో క్లూస్‌ సేకరించి, మృతదేహన్ని ఉస్మానియా మార్చురీ కి తరలించిన చాదర్‌ ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..చాదర్‌ ఘాట్‌ పీ ఎస్‌ కు కూత వేటు దూరంలో అర్ధరాత్రి  రౌడీ షీటర్‌ దారుణ హత్య.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....