మద్యం తాగి వ్యక్తి మృతి – వైన్‌ షాపు ధ్వంసం

వైన్‌ షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌,జులై 5 (ఇయ్యాల తెలంగాణ) : 

నాచారంలోని కనకదుర్గ వైన్స్కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్‌ నిర్వాహకులు బయట పడేశారు.  అనంతరం అతను మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుటుంబ సభ్యులు కలిసి వైన్స్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం భార్య వైన్స్‌ షాపులోకి వెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....