ప్రైవేటు బస్సు ` లారీ ఢీ

వినుకొండ సెప్టెంబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ):  ప్రకాశం జిల్లా మేడపి సమిపంలో  తెల్లవారుజామున ప్రైవేటు బస్సు ` లారీ ఢీ కొన్న సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది.  మరో ఇరవై మంది వరకు గాయపడ్డారు.కర్నూలు జిల్లా  నందికొట్కూరు, ఎమ్మిగనూరు కు చెందిన మెప్మా సిబ్బంది (మహిళలు) విజయవాడ లో ట్రైనింగ్‌ కు బయలుదేరారు.మార్గమధ్యలో వీరి బస్సు ముందు వెళ్తున్న మరో వాహనం ప్రమాదానికి గురి కాగా అందులో ప్రయాణిస్తున్న వారు కూడా ఈ బస్సు లో ఎక్కారు…మేడపి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న లారీ వీరి బస్సు ను ఢీ కోనడంతో ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి గాయాలు కాగా, మరో మహిళ మృతి చెందింది.సమాచారం తెలుసుకున్న  త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....