నిరుద్యోగులకు మోడీ వరాలు

వరంగల్‌, జూలై 8, (ఇయ్యాల తెలంగాణ ): ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రధాని మోదీ విచ్చేశారు. కాజీపేట సవిూపంలోని మడికొండలో భారీ పెట్టుబడితో రైల్వే వ్యాగన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభించారు. 160 ఎకరాల స్థలంలో520 కోట్ల అంచనా బడ్జెట్‌ తో వ్యాగన్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది. కాజీపేట్‌ ఇప్పటివరకు రైల్వే ఓవరాలిన్గ్‌ యూనిట్‌ కు పరిమిషన్‌ ఉంది. కానీ, ఇప్పుడు ఓవరలింగ్‌ యూనిటీ తో పాటు వ్యాగన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది కేంద్రం.  రైల్వే కొత్త ప్రాజెక్ట్‌ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4000 మందికి ఉద్యోగ కల్పన జరగనుంది అని రైల్వే అధికారులు అంటున్నారు.  2025 వరకు ఈ వ్యాగన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి యూనిటీ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. వ్యాగన్‌  యూనిటీ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1200 వ్యాగన్లు, రెండవ సంవత్సరం 2400 వ్యాగన్లు తయారు చేస్తామని అధికారులు అంటున్నారు.  మొత్తం గా నెలకి 200 వాగన్‌ లు ఉత్పత్తి జరుగుతుంది.కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద యూనిట్‌ అవుతుంది.  మొదటిది పశ్చిమ బెంగాల్లో ఉంది. ప్రస్తుతం ఇండియన్‌ రైల్వేలో వ్యాగన్ల కొరత ఉన్నందున వ్యాగన్‌ తయారీ యూనిట్‌ కాజీపేటలో ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ తయారయ్యే వ్యాగన్‌ లతో ఇండియన్‌ రైల్వే లో సరుకు రవాణా మెరుగు పడుతుందన్నారు. .ఓపెన్‌, క్లోజ్‌, వాగన్‌ లతో పాటు అన్ని రకాల సరుకు రవాణా కి ఉపయోగపడే విధంగా వ్యాగన్‌ లు రెడీ అవుతాయని అధికారులు అంటున్నారు.ఇండియన్‌ రైల్వే లో వ్యాగన్‌, కోచ్‌ ల కొరత ఉన్నప్పటికి విలువలో రెండూ సమానం అని.. దేశంలో ఇప్పటికే చాలా కోచ్‌ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ, కాజీపేట కి కోచ్‌ ఫ్యాక్టరీ రావాలని కల ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  వ్యాగన్‌ ఫ్యాక్టరీ కి అనుమతి ఇచ్చింది. దీంతో ఆ దిశగా శంకుస్థాపన జరిగింది. 2025 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి వ్యాగన్‌ లు తయారీ మొదలు కానున్నాయి అని అధికారులు అంటున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....