నా ఓటు లక్ష

ఖమ్మం నవంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ):నా ఓటు లక్ష అంటూ ఖమ్మం లో  ప్లకార్డు పట్టుకొని తిరుగుతున్నాడు ఓ వృద్దుడు. ఖమ్మం నగరంలో ఓ వృద్ధుడు వినూత్నంగా  నిరసన తెలుపుతుండడముతో ఖమ్మం నగర వాసులు  ఆసక్తిగా చూస్తున్నారు. నగరానికి చెందిన వెంకట సుబ్బారావు అనే వృద్దుడు నా ఓటు లక్ష కు అమ్ముతానని అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంకులో ఫిక్సెడ్‌ చేసి నెల నెలా వచ్చే డబ్బులతో అనాధలకు అన్నం పెడతానని అంటున్నాడు. ఓటు డబ్బుతో ముడి పడి ఉన్నదని ఓటుని ఎవరు సరిగా ఉపయోగించు కోవడం లేదని అందరూ అమ్ముకుంటున్నారని అంటున్నారు. ఖమ్మం నగరం లో ఉన్న  సమస్యలను అధికారుల దృష్టికి తీసుక పోవడానికి ప్లాకార్డ్‌ లు విూద సమస్యలు రాసి నగరంలో తిరుగుతుంటాడు అని స్థానికులు అంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....