డబుల్‌ సెంచరీ వైపు పరుగులు తీస్తున్న కూరగాయలు కొనలేని స్థితిలో సామాన్యులు

 

ఏలూరు జులై 7, (ఇయ్యాల తెలంగాణ ):అనునిత్యం వంటలో ప్రధానంగా అందరూ ఉపయోగించే మిర్చి టమాటా ధరలు కొండెక్కడంతో పేద ప్రజలకు మరేం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నారు. కిలో పచ్చిమిర్చి రెండు వందల రూపాయలు కిలో టమాట వంద రూపాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు ధరలు మండుతుండడంతో రైతు బజారుకు వెళ్ళినవారు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. దుకాణాల్లో కూరగాయలు కొన్న నాథుడే ఉండటం లేదని దుకాణదారులు వాపోతున్నారు రోజురోజుకీ కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. తప్ప ఏమాత్రం తగ్గడం లేదని ప్రజలు అంటున్నారు కూరగాయల ధరల కన్నా చికెన్‌ కోడిగుడ్డులు తరాలు తక్కువగా ఉన్నాయని పలువురు అంటున్నారు. శాకాహారులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో పావు కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూరగాయల ధరలు తగ్గేది సామాన్య మధ్యతరగతి ప్రజలు బాధలు పోయేది ఎప్పుడు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....