జలమండలి ముందు ధర్నా

హైదరాబాద్‌ జులై 5 (ఇయ్యాల తెలంగాణ ):పాత బస్తీ హనుమాన్‌ నగర్‌ లో డ్రైనేజీ వ్యవస్థ  పనిచేయకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్‌ నగర్‌ లోని జలమండలి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ర్షపు నీరు నిల్వ ఉండడం, మురుగు రోడ్లపై పారుతుండడంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితమవుతుండడంతో అంటు వ్యాధులుప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు.నీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....