హైదరాబాద్ ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):గోషామహల్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. గోషామహల్ నియోజకవరంలోని జాంబాగ్ , బేగం బజార్ డివిజన్ లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జాంబాగ్ లో మైనారిటీలు మంత్రిపై పూలజల్లుతూ వెల్కం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేసే హావిూలన్నీ ఆచరణ సాధ్యం కానివే. ఓట్లను దండుకొనే లక్ష్యంతో అవగాహన లేకుండా హావిూలు ప్రకటిస్తున్నారు. కర్ణాటక లో ఇచ్చిన హావిూలు అమలు చేసి చూపెట్టండి. 50 సంవత్సరాలు పాలించారు కదా ప్రజలకు ఏం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అధికారం కోసం ఏ గడ్డి అయిన తింట్టం అన్నట్టుగా..రోజుకో డిక్లరేషన్ పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లు మూతి తుడుచుకోవడానికి కూడా పనికి రావని అన్నారు.
- Homepage
- Telangana News
- గోషామహల్ నియోజకవర్గం లో మంత్రి తలసాని అభివృద్ధి పనులు
గోషామహల్ నియోజకవర్గం లో మంత్రి తలసాని అభివృద్ధి పనులు
Leave a Comment