గోదావరి ఎక్స్ప్రెస్‌ రైల్లో ఎలుక కలకలం

హైదరాబాద్‌ ఆగష్టు 14 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్‌ లో ఎలుక కలకలం రేపింది.  రైలు థర్డ్‌ ఏసీ కోచ్‌  క్యాబిన్‌ కంట్రోల్‌ పానెల్‌ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్‌ నెలకొంది. ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్‌ స్టేషన్‌ దగ్గర ఈ ఘటన జరిగింది.దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు.సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్‌ నెలకొంది.సిబ్బంది  ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. పొగలు రావడంతో ప్రయాణికులు భయపడి బయటకు వెళ్లేందుకు ఎగబడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....