గురు రవిదాస్ దీవెనలు – Prof కోదండరామ్ కు ఎల్లప్పుడు ఉంటాయి

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : సమాజ శ్రేయస్సు కోరే ప్రొఫెసర్ కోదండరామ్ కి సంత్ గురు రవిదాస్ మహారాజ్ దీవెనలు ఎల్లప్పుడు ఉంటాయని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఉదయం టీజేఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ ని మర్యాద పూర్వకంగా కలసి సంత్ శీరోమణీ గురు రవిదాస్ మహారాజ్ యొక్క మెమంటోని బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రగిరి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సంక్షేమం కోరుకునే ప్రొఫెసర్ కోదండరామ్ కి రవిదాస్ మహారాజ్ ఆశీర్వాద గురు బలం ఎల్లప్పుడు ఉండాలని కోరుకునే వారిలో నేను ఒకరిని అని పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....