కంటోన్మెంట్‌ లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

సికింద్రాబాద్‌ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌  కూతురు డాక్టర్‌ వెన్నెలకు టికెట్‌ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ నాయకులు వెన్నెల నివాసానికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెన్నెల విూడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించిన కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు   ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోనీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతానని ఆమె తెలిపారు అధిష్టానం ఆదేశాల తీసుకొని ప్రచారానికి ముందుకు సాగుతాను  తెలిపారు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....