ఈ నెల 6 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహారం ప్రారంభం

 

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ ): ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని, రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 14 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల బతుకమ్మ చీరల పంపిణీని పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో యువతకు 18 వేల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....