ఈటల, అర్వింద్‌ కు కమాండోల భద్రత

హైదరాబాద్‌ జులై 10, (ఇయ్యాల తెలంగాణ ): బీజేపీ నేతలకు హై సెక్యూరిటీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అరవింద్‌ లకు భద్రత పెంచారు. వారిద్దరికి కేంద్ర భద్రత బలగాలు ఇకనుంచి భద్రత కల్పించనున్నాయి. సీఆర్పిఎఫ్‌ భద్రత పరిధిలోకి ఇద్దరు నేతలు వుంటారు. ఇద్దరికీ బుల్లెట్‌  ప్రూఫ్‌ వాహనాల కేటాయించినట్లు సమాచారం. భద్రత అడిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఇద్దరు నాయకుల ఇళ్లకు సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు వెళ్లారు. ఈటల రాజేందర్‌ కు వై ప్లస్‌ కేటగిరి, ధర్మపురి అర్వింద్‌ కు వై కేటగిరి స్థాయి భద్రత కల్పిస్తారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....