హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఇయ్యాల తెలంగాణ) : ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు సి ఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన ప్రసంగించారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తాం. 64ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నాం. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నాం. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తాం. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు.. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని అన్నారు.
- Homepage
- Telangana News
- అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు : CM రేవంత్ రెడ్డి
అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు : CM రేవంత్ రెడ్డి
Leave a Comment