హైదరాబాద్ జూన్,30,( ఇయ్యాల తెలంగాణ ):బోనాల సందర్భంగా అంబర్పేట్ మహంకాళి టెంపుల్ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై అంబర్ పేట్ మహంకాళీ అమ్మ వారి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ కార్యవర్గం, పోలిస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహంకాళి టెంపుల్ తో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాలలో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారి చేశారు.