అంగన్వాడీ లను అరెస్ట్‌ చేసిన పోలీసులు

మైలవరం సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ )కనీస వేతన చట్టం అమలు కోరుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్ధమైన అంగన్వాడీ మహిళల ను పోలీసులు అడ్డుకొని బలవంతం గా పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు.న్యాయమైన అంగన్వాడీ కార్యకర్తల కోరికలు నెరవేర్చాల్సిన ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం దారుణమని  అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేసారు.  అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తల కు సీఐటియూ నాయకులు చాట్ల సుధాకర్‌ మద్దతు ప్రకటించారు.  అహర్నిశలు చాకిరీ చేసే అంగన్వాడీ ల కి కనీసం వేతనాలు ఇవ్వాలని కోరితే మహిళలు అనే కనీస ఇంగితం లేకుండా పోలీసుల తో అరెస్టులు చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజ్యాంగ విలువలని కాలరాస్తున్నారని చాట్ల సుధాకర్‌ ద్వజమెత్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....