చార్మినార్, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం శుక్రవారం కావడంతో ఈ రోజు పాతనగరంలోని అనేక ఆలయాల వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగించారు. అమ్మవారి ప్రత్యేక హారతి కార్యక్రమాలు కొనసాగాయి. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆషాడ మాసం కావడంతో బోనాల సమర్పణకు ప్రత్యేక పూజ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల దగ్గర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.