
హైదరాబాద్, ఆగస్టు 25, (ఇయ్యాల తెలంగాణ) : సేవక్నగర్ బస్తీలో ప్రమాదం జరిగే సంఘటనలు ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని కోరుతూ సేవక్నగర్ జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సీతారాం పేట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు. సేవక్ నగర్ లో విద్యుత్ తీగలు తెగి పడే స్థితిలో ఉన్నాయని, ఇబ్బంది కరంగా ఉండి స్థానిక ప్రజలకు భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయని వాటి మర్మతులు చేయాల్సిందిగా సీతారాంపేట ఎ ఇ ని కోరారు. ప్రస్తుతం గణేష్ చతుర్థి సమీపిస్తుండడంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇబ్బందికర విద్యుత్ తీగలను వెంటనే తొలగించాల్సిందిగా ధరకాస్తులో కోరారు. ఈ కార్యక్రమంలో సేవక్నగర్ జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సబ్యులు ఆర్. శివ కుమార్ పి. సాయి కుమార్, ఎన్. ప్రేమ్ కుమార్, ఎ. వినోద్, పి కైలాష్ తదితరులు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.