Tesla సెకండ్‌ Show Room

ముంబై, ఆగస్టు 9 (ఇయ్యాల తెలంగాణ) : ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత మార్కెట్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించి నెల తిరగకముందే, దేశ రాజధాని ఢల్లీిలో రెండో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 11న ఈ కొత్త టెస్లా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు సోషల్‌ విూడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో, ‘‘ఢల్లీికి వచ్చేస్తున్నాం ` వేచి చూడండి’’ అంటూ ఒక గ్రాఫిక్‌తో కూడిన పోస్ట్‌ను టెస్లా పంచుకుంది. ఢల్లీిలోని అత్యంత ఖరీదైన ఏరోసిటీ ప్రాంతంలో ఉన్న వరల్డ్‌మార్క్‌ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గత నెల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరయ్యారు.

ఆ సందర్భంగా, టెస్లా తన మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ ‘మోడల్‌ వై’ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 60 లక్షలుగా ఉంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి మోడల్‌ వై డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.టెస్లా మోడల్‌ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్‌ రియర్‌`వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ 60 సచిష్ట్ర బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కిలోవిూటర్ల రేంజ్‌ ఇస్తుంది. ఇక లాంగ్‌`రేంజ్‌ వేరియంట్‌ 75 సచిష్ట్ర బ్యాటరీతో 622 కిలోవిూటర్ల వరకు ప్రయాణిస్తుంది. తొలి దశలో ముంబై, పుణె, ఢల్లీి, గురుగ్రామ్‌ నగరాల్లోని వినియోగదారులకు డెలివరీలలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫ్లాట్‌`బెడ్‌ ట్రక్కుల ద్వారా నేరుగా వినియోగదారుల ఇంటికే కార్లను డెలివరీ చేయనున్నారు.అంతేకాకుండా, తన వెబ్‌సైట్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహన రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా టెస్లా కల్పించింది. ఇక రూ. 6 లక్షల అదనపు ధరతో లభించే ఫుల్‌ సెల్ఫ్‌`డ్రైవింగ్‌ (ఎఫ్‌ఎస్‌డీ) ఫీచర్‌ను మాత్రం భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ స్పష్టం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....
Related Post