Temple కి వెళ్లే మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు

   ఈ ప్రమాదంలో ఐదుగు మృతి .. 14 మంది తీవ్రంగా గాయాలు

శ్రీనగర్‌ ఆగష్టు 26  (ఇయ్యాల తెలంగాణ) : జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఘటనస్థలిలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....