SIKKIM లో మెరుపు వరదలు.. 23 మంది ARMY సిబ్బంది గల్లంతు

గ్యాంగ్టక్‌ అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ):  ఈశాన్య రాష్ట్రం సిక్కింలో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి. తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలగుండా ప్రవహిస్తోంది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌ టక్‌ కు 30 కిలోవిూటర్ల దూరంలో వున్న సింగ్టం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. తీస్తా నది పరిసరాల్లో వున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడిరచాయి. కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడిరచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. పునరావస చర్యలు వేగవంతం చేసామని అయన అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....