చార్మినార్, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ సుధా థియేటర్ విడిపి స్కూల్లో శివరాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాణి ఫౌండేషన్ అధ్యక్షురాలు శివరాణి ఠాగూర్ సంపత్ ప్రిన్సిపాల్ సురేష్ ల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివరాణి ఫౌండేషన్ అధ్యక్షురాలు శివరాణి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించడం వల్ల ప్రకృతి ని కాపాడడమే కాకుండా, మనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. పాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన గణపతులు వాడటం వల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మండపాల వద్ద భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సినిమా పాటలు లాంటివి పెట్టకూడదని తెలిపారు. పిల్లల్లో విచిత్ర వేషాలు వేస్తూ నాటకాలు దేవుని గురించి పారాయణం చెప్పవలసిన అవసరం ఉందని తెలిపారు. ఉచిత మట్టి గణపతులను హెచ్ఎండిఏ సహకారంతో పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
- Homepage
- Charminar Zone
- Shiva Rani ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ !
Shiva Rani ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ !
Leave a Comment